నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లిలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ లక్ష్మీ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. గర్భిణీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీఓ ఖాజా, ఉపసర్పంచ్ మల్లయ్య, ఈ యూత్ ప్రెసిడెంట్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
